Sunday, February 23, 2025

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ..

- Advertisement -
- Advertisement -

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ తగ్గింది. మంగళవారం శ్రీవారిని దర్శించుకునేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 8 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచివున్నారు. దీంతో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతున్నది. ఇక, శుక్రవారం శ్రీవారిని 61,576 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారికి 23,412 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.54 కోట్లు వచ్చినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు.

కాగా, ఆన్‌లైన్‌లో జనవరి నెల ఆర్జిత సేవా టిక్కెట్లను శనివారం ఉదయం విడుదల చేయనుంది టిటిడి. ఉదయం 10 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 10 గంటల వరకు లక్కీడిప్‌ రిజిస్ట్రేషన్ కు అవకాశం కల్పించింది. ఎల్లుండి మధ్యాహ్నం లక్కీడిప్ విధానంలో ఆర్జిత సేవా టికెట్లు కేటాయించనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News