Monday, October 28, 2024

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. నేరుగా శ్రీవారి దర్శనం

- Advertisement -
- Advertisement -

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ తగ్గింది. గత వారం రోజులుగా శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గుతోంది.  సోమవారం కూడా స్వామివారిని దర్శించుకునేందుకు తక్కువ సంఖ్యలోనే భక్తులు తిరుమలకు వస్తున్నారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లలో వేచి ఉండే అవసరం లేకుండా భక్తులు నేరుగా స్వామివారిని దర్శించుకుంటున్నారు.

కాగా ఆదివారం శ్రీవారిని 69,333 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారికి 22,606 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.53 కోట్లు వచ్చినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News