Monday, July 1, 2024

తిరుమల వెంకన్న దర్శనానికి 16 గంటల సమయం

- Advertisement -
- Advertisement -

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు శనివారం వీకెండ్ కావడంతో భారీగా భక్తులు తరలివచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. దీంతో టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు.

ఇక, శుక్రవారం శ్రీవారిని 66,256 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఇక, స్వామివారికి 40,005  మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక, శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.54 కోట్లు వచ్చినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు. జులై 18న అక్టోబర్ నెల శ్రీవారి దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News