Wednesday, July 3, 2024

తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం

- Advertisement -
- Advertisement -

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు ఆదివారం సెలవు దినం కావడంతో భారీగా భక్తులు తరలివచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. దీంతో టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ ఎస్‌ఎస్‌డి దర్శనానికి 6 గంటల సమయం పడుతుండగా.. రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది.

ఇక, శనివారం శ్రీవారిని 64,467 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఇక, స్వామివారికి 40,005  మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక, శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.77 కోట్లు వచ్చినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News