Saturday, September 14, 2024

చైనా సైబర్ నేరగాళ్లు బరితెగింపు.. భారతీయ మహిళల అక్రమ రవాణా

- Advertisement -
- Advertisement -

విదేశాల్లో ఉద్యోగాల పేరిట ట్రాప్
కాంబోడియాకు భారతీయు మహిళల అక్రమ రవాణా
వారితో న్యూడ్ కాల్స్ చేయిస్తూ స్వదేశంలో హనీట్రాప్‌కు తెగబడుతున్న వైనం
బాధితుల్లో తెలుగు రాష్ట్రాల మహిళలు

చైనా సైబర్ నేరగాళ్లు మరింతగా బరితెగిస్తున్నారు. భారతీయ మహిళలను కాంబోడియాకు అక్రమ రవాణా చేసి భారీగా సొమ్ములు దండుకుంటున్నారు. భారతీయ మహిళలతో స్వదేశంలో ఉన్న వాళ్లకు న్యూడ్ కాల్స్ చేయిస్తూ హానీట్రాప్‌కు తెగబడుతున్నారు.. అలా న్యూడ్ కాల్స్‌తో పైసా వసూలు చేస్తున్నారు. చైనా సైబర్ నేరగాళ్లు వినూత్న మార్గాల్లో భారతీయులను టార్గెట్ చేస్తున్నారు. విదేశాల్లో ఉద్యోగాల పేరిట యూత్‌ను ట్రాప్ చేస్తున్నారు. ఐటి ఉద్యోగాల పేరుతో కాంబోడియా రాజధాని నామ్‌ఫెన్‌కు తరలిస్తున్నారు.

ఉద్యోగాల పేరుతో భారతీయుల దగ్గర డబ్బులు వసూలు చేసి అడ్డమైన పనులు చేయిస్తున్నారు. ప్రకాశ్ అనే తెలుగు యువకుడు కాంబోడియాలో ఇలాగే చిక్కుకు పోయాడు. తమిళనాడులో ఉన్న తన సోదరికి సెల్ఫీ పంపి బాధను వెల్లడించాడు. భారత ఎంబసి సాయంతో అతడు స్వదేశానికి తిరిగి వచ్చాడు. అయితే కాంబోడియాలో ఇంకా 3000 మంది భారతీయులు చిక్కుకున్నారని, వాళ్లను సైబర్ బానిసల్లా మార్చారని ప్రకాశ్ వెల్లడించాడు. భారతీయ యువతులను బంధించి న్యూడ్ కాల్స్ చేయిస్తున్నారని ఆరోపించాడు. సైబర్ బానిసలతో డబ్బును సంపాదిస్తున్న చైనా స్కామర్లు తొలుత ఆ సొమ్మును క్రిప్టో కరెన్సీగా మారుస్తున్నారు. తరవాత అమెరికా డాలర్లుగా కన్వర్ట్ చేస్తున్నారు.

డాలర్లను చైనీస్ యువాన్ కరెన్సీగా మార్చి స్వదేశానికి తరలిస్తున్నారు. ఈ సైబర్ నేరగాళ్ల ఆగడాలను సివిల్ ఇంజినీరింగ్‌లో బి.టెక్ చేసిన మున్షీ ప్రకాష్ కళ్లకు కట్టినట్లు వెల్లడిం చారు. హైదరాబాద్‌కు చెందిన ఐటీ సంస్థలో ఉద్యోగం చేస్తున్న ప్రకాష్ విదేశాల్లో ఉపాధి కోసం అనేక జాబ్ సైట్‌లలో తన ప్రొఫైల్‌ను పోస్ట్ చేశాడు. అతనికి ఆస్ట్రేలియాలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ కంబోడియాలో ఒక ఏజెంట్ విజయ్ నుండి కాల్ వచ్చింది. ఆస్ట్రేలియా వెళ్లే ముందు తన ట్రావెల్ హిస్టరీని అందించాలని ఆ వ్యక్తి కోరాడని, మలేషియా వెళ్లేందుకు టిక్కెట్లు ఇప్పించాడని ప్రకాష్ చెప్పాడు. మార్చి 12న, మహబూ బాబాద్‌లోని బయ్యారం మండలానికి చెందిన ప్రకాష్‌ను నమ్‌పెన్‌కు తీసుకెళ్లారు, అక్కడ విజయ్ స్థానిక ప్రతినిధి అతని నుండి రూ.85,000 విలువైన అమెరికన్ డాలర్లను తీసుకున్నాడు.

తర్వాత చైనా జాతీయులు నా పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. నన్ను క్రోంగ్ బావెట్‌కు తీసు కెళ్లారు. అది టవర్‌లతో కూడిన పెద్ద కాంపౌండ్. నన్ను ఇతర భారతీయులతో కలిసి టవర్ సిలో ఉంచారు. అమ్మాయిల నకిలీ సోషల్ మీడియా ప్రొఫైల్‌లను సృష్టించడానికి, ఉపయోగించడానికి తెలుగు, ఇతర భాషల్లో మాకు పది రోజుల శిక్షణ ఇచ్చారని ప్రకాశ్ చెప్పాడు.. తీసుకెళ్లితన తర్వాత చీకటి గదిలో ఉంచి వారం రోజుల పాటు చిత్రహింసలకు గురిచేశారని.. అనారోగ్యానికి గురైనప్పుడు వారు తనను బయటకు తీసు కెళ్లినప్పటికీ, స్కాం చేయమని బలవంతం చేశారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News