Thursday, October 24, 2024

9మంది జిల్లా జడ్జీల బదిలీ

- Advertisement -
- Advertisement -

transfer of nine district judges across telangana

మన తెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది మంది జిల్లా జడ్జిలను బదిలీ చేస్తూ ఈ మేరకు బుధవారం నాడు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈక్రమంలో రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శిగా ఎం.వి.రమేశ్, రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్‌గా సిహెచ్‌కె భూపతి నియమితులయ్యారు. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి గా వై.రేణుక, హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు జడ్జిగా ఇ. తిరుమల దేవి, నల్గొండ జిల్లా ప్రిన్సిపల్ జడ్జిగా బి.ఎస్.జగ్జీవన్ కుమా ర్, నిజామాబాద్ జిల్లా ప్రిన్సిపల్, సెషన్స్ జడ్జిగా సునీత కుంచాల, ఆదిలాబాద్ జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జిగా మంత్రి రామకృష్ణ సునీత, సిటీ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జిగా వి.బి.నిర్మల గీతాంబ, రాష్ట్ర వ్యాట్ అప్పీలేట్ ట్రైబ్యునల్ ఛైర్ పర్సన్‌గా జి.అనుపమ చక్రవర్తిలు బదిలీ అయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News