Sunday, April 27, 2025

ఢిల్లీలో భారీ వర్షాలు… ఆటోపై చెట్టు పడడంతో డ్రైవర్ మృతి….

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ఉత్తర భారతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు ఢిల్లీ అతలాకుతలమైంది. వర్షాలు ధాటికి ఆటోపై చెట్టు పడడంతో డ్రైవర్ మృతి చెందాడు. ఈ సంఘటన ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో జరిగింది. రాజేందర్ అనే డ్రైవర్ తన ఆటోలో రోహిణి స్పోర్ట్ కాంప్లెక్స్ నుంచి వెళ్తుండగా ఆటోపై చెట్టు కూలింది. తీవ్రంగా గాయపడడంతో అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆస్పత్రిలో రాజేందర్ చనిపోయాడు. మృతదేహాన్ని బిఎస్‌ఎ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆటోను బయటకు తీసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఉత్తర భారతంలో భారీ వర్షాల ధాటికి ఆదివారం ఒక్కరోజు 14 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

Also Read: మాజీ ప్రియురాలి తల్లిపై ప్రియుడు కాల్పులు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News