మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమా నుంచి హీరోయిన్ త్రిష తప్పుకుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మ్యాట్నీ మూవీస్ సంస్థతో కలిసి నిర్మిస్తున్న ఈ మూవీ శరవేగంగా జరుపుకుంటోంది. కాగా, ఈ మూవీలో చిరు సరసన నటించే హీరోయిన్ కోసం చాలా మంది కథానాయికలను అనుకుని చివరకు త్రిషను సెలెక్ట్ చేసుకున్నారు. అయితే, ఈ సినిమా నుంచి తాను తప్పుకుంటున్నట్లు చెప్పి అభిమానులకు షాక్ ఇచ్చింది త్రిష. ”కొన్నిసార్లు మొదట మనం అనుకున్నట్లు, చర్చించుకున్నట్లు కాకుండా విభిన్నంగా మారుతుంటాయి. క్రియేటీవ్ లో భిన్నబిప్రాయాలు వల్ల చిరంజీవి సర్ సినిమాలో నటించకూడదని నిర్ణయించుకున్నాను. మూవీ యూనిట్ కు నా అభినందనలు. నా లవ్లీ తెలుగు ఆడియెన్స్.. మరో మంచి ప్రాజెక్టుతో త్వరలో మీ ముందుకు వస్తానని అశిస్తున్నా” అని ట్వీట్టర్ ద్వారా త్రిష పేర్కొంది. కాగా, చిరంజీవి-త్రిష కాంబినేషన్ స్టాలిన్ మూవీ తెరకెక్కిన విషయం తెలిసింది.
Trisha walk out from Chiru-Koratala Movie