Thursday, September 19, 2024

కేంద్రం గురివింద నీతి

- Advertisement -
- Advertisement -

శ్రీలంకపై అఖిలపక్ష భేటీలో
రాష్ట్రాల అప్పులపై చర్చ
కేంద్ర వైఖరిపై టిఆర్‌ఎస్
పార్లమెంటరీ నేతల ఆగ్రహం

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ అప్పులు కేంద్ర ప్ర భుత్వం నిర్దేశించిన ఎఫ్‌ఆర్‌బిఎం 3.5శాతం పరిధిలో నే ఉన్నాయని, కానీ కేంద్ర ప్రభుత్వం అప్పులు ఏకం గా 6.2శాతం దాటాయని టిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నా యకులు కే కేశవరావు, లోక్ సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు మండిపడ్డారు. అప్పులు తీసుకున్నా చెల్లించడంలో తెలంగాణ ఏమైనా తరువాయి నిర్లక్ష్యం చేసిందా? అని ఎంపి కేశవరావు కేంద్ర మంత్రులను నిలదీశారు. ఇప్పటి వరకు కేంద్రం చేసిన అప్పులకు సమాధానం ఎవరిస్తారని ఘాటుగా ప్రశ్నించారు. దేశ ఆర్థిక పరిస్థితిపై చర్చ జరగాలని ఈ సందర్భంగా వారు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కాగా శ్రీలంక సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం మంగళవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. సమావేశంలో కేంద్ర మంత్రులు జైశంకర్, ప్రహ్లాద్ జోషితో పాటు విదేశీ వ్యవహారాల శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంక్షోభంపై ప్రజెంటేషన్ కేంద్రం ఇచ్చింది. శ్రీలంకలో ప్రస్తుత పరిస్థితికి కారణమైన రాజకీయ పరిస్థితులతో పాటు, స్థాయికి మించి అపరిమితంగా చేసిన అప్పులే కారణమంటూ కేంద్రం పేర్కొంది. అనంతరం రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై విదేశీ వ్యవహరాల మంత్రిత్వ శాఖ అధికారులు ప్రజెంటేషన్ ఇవ్వగా దీన్ని టిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు కే కేశవరావు, లోక్ సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు మండిపడటంతో పాటు తీవ్రంగా తప్పుపట్టారు.

తలసరి ఆదాయంలో దేశంలోనే రెండోస్థానంలో తెలంగాణ ఉందని, కేవలం ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల అప్పులు గురించే మాట్లాడడం వెనుక రాజకీయ దురుద్దేశాలున్నాయని వారు మండిపడ్డారు. ఎలాంటి సందర్భం లేకుండా రాష్ట్రాల అప్పుల ప్రజెంటేషన్ ఏంటీ? అంటూ నిలదీశారు. తెలంగాణ అప్పులు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఎఫ్‌ఆర్‌బిఎం 3.5శాతం పరిధిలోనే ఉన్నాయని, కానీ కేంద్ర ప్రభుత్వం అప్పులు ఏకంగా 6.2శాతం దాటాయని మండిపడ్డారు. అప్పులు తీసుకున్నా చెల్లించడంలో తెలంగాణ ఏమైనా నిర్లక్ష్యం చేసిందా అంటూ ఎంపి కేశవరావు నిలదీశారు. కేంద్రం చేసిన అప్పులకు సమాధానం ఎవరిస్తారని ప్రశ్నించారు. దేశ ఆర్థిక పరిస్థితిపై చర్చ జరగాలని ఆయన ఈ సందర్భంగా ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

విపక్షాల అభ్యంతరం 

శ్రీలంక సంక్షోభంపై నిర్వహిస్తున్న అఖిల పక్ష పార్టీ సమావేశంలో వివిధ రాష్ట్రాల అప్పుల గురించి ప్రస్తావించడంపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి.ప్రస్తుతం ఈ విషయం కొత్త వివాదానికి దారి తీసింది. శ్రీలంక ప్రస్తావన తెస్తూ ఎపి, తెలంగాణ అప్పులపై మాట్లాడింది. శ్రీలంక పరిస్థితికి రాజకీయాలు, అప్పులే కారణం అని కేంద్రం ఈ సమావేశంలో వెల్లడించింది. దీంతో పాటు శ్రీలంకలో చైనా పెట్టుబడులు, పోర్టుల్లో పెట్టుబడుల కారణంగా రుణ ఊబిలో చిక్కకుపోయిందని కేంద్రం విశ్లేషించింది. ఈ సమావేశంలో శ్రీలంక సంక్షోభం అప్పులపై విదేశాంగ మంత్రిత్వ శాఖ అన్ని పార్టీలకు వివరించింది. అయితే శ్రీలంక ప్రస్తుత సంక్షోభానికి అపరిమిత అప్పులే కారణం అని విశ్లేషణాత్మకంగా కేంద్ర ప్రభుత్వం వివరించింది. ఈ సందర్భంగా భారత్ లో కొన్ని రాష్ట్రాలు చేస్తున్న అప్పులు, పర్యవసానాలపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు.

ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు చేస్తున్న అపరిమిత అప్పుల గురించి చర్చించారు. అయితే ఈ సమావేశంలో రాష్ట్రాల అప్పుల గురించి చర్చించడాన్ని టిఆర్‌ఎస్ నేతలు కేశవరావు, నామా నాగేశ్వర్ రావులు తీవ్రంగా వ్యతిరేకించారు. పరిమితికి మించి కేంద్ర చేస్తున్న అప్పుల గురించి కూడా వివరించాలని గట్టిగా డిమాండ్ చేశారు.అంతేకాకుండా కేవలం ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల గురించి మాట్లాడటంలో రాజకీయ దురుద్దేశం ఉందని నామా నాగేశ్వర్ రావు విమర్శించారు. తెలంగాణ తలసరి ఆదాయంలో దేశంలోనే రెండో స్థానంలో ఉందని, గత ఎనిమిదేళ్లలో కేంద్ర లక్ష కోట్లకు పైగా అప్పులు చేసిందన్నారు.తెలంగాణ జిఎస్‌డిపిలో కేవలం 23 శాతం మాత్రమే అప్పులు ఉన్నాయని ఆయన కేంద్రానికి వివరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News