Sunday, June 30, 2024

నేడు పదోతరగతి సప్లిమెంటరీ ఫలితాలు

- Advertisement -
- Advertisement -

పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు శక్రవారం విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. మధ్యాహ్నం 3 గంటలకు ఎస్‌ఎస్‌సి బోర్టు అధికారులు ఫలితాలు విడుదల చేయనున్నారు. ఫలితాలను అధికారిక వ్బ్సైట్ bse.telangana.gov.inలో చూసుకోవచ్చని వారు తెలిపారు. వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 3 నుంచి 13 వరకు సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించారు. అదేవిధంగా పదో తరగతి వార్షిక పరీక్షా ఫలితాల్లో మొత్తం 91.31 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 93.23 శాతం బాలికలు, 89.42 శాతం బాలురు ఉత్తీర్ణత సాధించారు. 3,927 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించగా ఆరు పాఠశాలల్లో జీరో శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇక గతేడాది వార్షిక పరీక్షలో 89.60 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా ఈ ఏడాది 91.31 శాతానికి పెరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News