Friday, September 20, 2024

ముగిసిన డిఎస్‌సి పరీక్షలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన డిఎస్‌సి పరీక్షలు సోమవారంతో ముగిసాయి. గత 18వ తేదీన ప్రారంభమైన ఈ పరీక్షలను 55 కేంద్రాలలో షిఫ్టుల వారీగా ఆన్‌లైన్ విధానంలో నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం 2,79,957 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 2,45,263(87.61 శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 1,61,745 మందికి 1,37,872 (85.24 శాతం), సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్‌జిటి) పోస్టులకు 88,005కి 81,053 (92.10 శాతం),

లాంగ్వేజ్ పండిట్ పోస్టులకు 18,211కు 16,092(88.36 శాతం), పిఇటి పోస్టులకు 11,996కు 10,246(85.41 శాతం) మంది హాజరయ్యారు. రాష్ట్రంలో తొలిసారి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సిబిటి) విధానంలో డిఎస్‌సి పరీక్ష నిర్వహించారు. సోమవారంతో డిఎస్‌సి పరీక్షలు ముగిసిన నేపథ్యంలో త్వరలో ఆయా ప్రశ్నాపత్రాలకు సంబంధించిన ప్రాథమిక కీ విడుదల చేసి, వాటిపై అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అనంతరం ఆయా ప్రశ్నాపత్రాల తుది కీ ఖరారు చేస్తారు. ఈసారి ఆన్‌లైన్ విధానంలో డిఎస్‌సి నిర్వహిస్తున్నందున తుది కీ ఖరారైన వారం పది రోజుల్లో ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News