Wednesday, March 5, 2025

నేటి నుంచి ఇంటర్ పరీక్షలు

- Advertisement -
- Advertisement -

ఉ. 9 నుంచి మ.12 వరకు పరీక్షలు నిమిషం నిబంధనలో సడలింపు
ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతి హాల్‌టికెట్‌పై క్యూఆర్ కోడ్
1,532 పరీక్షా కేంద్రాల ఏర్పాటు పరీక్ష రాయనున్న 9.96 లక్షల మంది

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ పరీక్షలు బుధవారం(మార్చి 5) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 29 వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలను నిర్వహిస్తారు. ఇంటర్ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ పరీక్షల నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 1,532 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలకు మొత్తం 9,96,971 మంది విద్యార్థులు హాజరుకానుండగా, అందులో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4,88,448 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 4,40,788 మంది ఉన్నారని అన్నారు. ప్రతీ పరీక్షా కేంద్రాలలో 5 నుంచి 6 సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ ద్వారా పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించనున్నారు.

కమాండ్ కంట్రోల్‌లో 31 స్క్రీన్లతో పరీక్షా కేంద్రాలు పర్యవేక్షించేలా ఏర్పాటు చేశారు. ప్రతీ పరీక్ష కేంద్రం పరిసరాల్లో 144 సెక్షన్(బిఆన్‌ఎస్ 163) అమలులో ఉంటుంది. మానసిక సమస్యలు, పరీక్షల ఒత్తిడితో ఇతర సమస్యలు ఎదుర్కొంటున్న విద్యార్థులకు కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్న విద్యార్థులు 9240205555 నెంబర్లకు ఫోన్ చేయవచ్చు. ఈసారి పరీక్షా కేంద్రాల గుర్తింపు కోసం హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్‌లను ముద్రించడం విశేషం. హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ కోసం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. దాంతోపాటు విద్యార్థుల ఫోన్లకే ఇంటర్మీడియేట్ హాల్ టికెట్లు పంపించారు. విద్యార్థులు ఎస్‌ఎంఎస్ లింకుపై క్లిక్ చేసి విద్యార్థులు హాల్ టికెట్ నెంబర్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఐదు నిమిషాల వరకు గ్రేస్ టైం
ఇంటర్ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులు ఉదయం 8.45 గంటల వరకు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. అయితే ఉదయం 9 గంటల తరువాత 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన వారిని కూడా కూడా అనుమతిస్తామని ఇప్పటికే ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య వెల్లడించారు. విద్యార్థులకు 1,2 నిమిషాలు నుంచి 5 నిమిషాల వరకు గ్రేస్ టైమ్ ఇస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులు పరీక్షా సమయం కంటే ముందే పరీక్షా కేంద్రాలకు వస్తే ఒఎంఆర్ షీట్ ప్రశాంతంగా నింపుకోవచ్చని, హడావుడి ఉండదని చెప్పారు. అందుకే ఉదయం 8.45 గంటల వరకు విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రంలోని మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ వస్తువులు, ప్రిటెండ్ మెటీరియల్స్‌ను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి ఉండదని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News