Sunday, March 2, 2025

మార్చిలోపు గ్రూప్స్ ఫలితాలు?

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : గ్రూప్ 1,2,3 పరీక్షల లితాలను త్వరగా ప్రకటించి మార్చి లోపు అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చే లా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రణాళి క సిద్ధం చేసింది. గ్రూప్ 1 ఫలితాలు వెల్లడించేందుకు టిజిపిఎస్‌సి హైకోర్టు అనుమతి ఇ చ్చిన నేపథ్యంలో మరో రెండు మూడు నెలల్లో ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. అ క్టోబర్ 21 నుంచి 27వ తేదీ వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిం దే. 2011 సంవత్సరం తర్వాత టిజిపిఎస్‌సి రాష్ట్రంలో గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలను అ త్యంత పకడ్బందీగా నిర్వహించారు. రిజర్వేష న్ల కోసం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టును కొట్టేసిన నేపథ్యంలో త్వరలోనే ఫలితాలు వెల్లడించేందుకు కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది.

వీటితో ఈ నెల 15,16 తేదీలలో జరిగిన గ్రూ ప్ -2 పరీక్షలు, నవంబర్ 17,18 తేదీలలో జరిగిన గ్రూప్ 3 ఫలితాలు కూడా మార్చిలోగా ప్రకటించేందుకు టిజిపిఎస్‌సి కసరత్తు చేస్తోంది. అఖిల భారత సర్వీసుల కోసం పరీక్షలు నిర్వహించే యుపిఎస్‌సి తరహాలో టిజిపిఎస్‌సి తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ నెల 18, 19 తేదీల్లో అధ్యయనం కోసం బుర్రా వెంకటేశం నేతృత్వంలో బృందం ఢిల్లీ పర్యటనకు వెళ్లింది. ఈ పర్యటనలో దేశంలో ఏటా పోటీ పరీక్షలు నిర్వహిస్తున్న ప్రముఖ ఏజెన్సీలు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యుపిఎస్‌సి), ఛీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సి), నేషనల్ టెస్టింగ్ ఏ జెన్సీలతో సమావేశమై ఆయా ఏజెన్సీలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేశారు.రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలలో ఎలాంటి అవకతకలు జరుగకుండా, షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించి సకాలంలో ఫలితాలు వెల్లడించే యాక్షన్ ప్లాన్ రూపొందించి త్వరలో ప్రభుత్వానికి నివేదిక అందిజేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News