Saturday, October 26, 2024

హరిత విప్లవ పితమహుడు… డా. ఎం.ఎస్ స్వామినాథన్

- Advertisement -
- Advertisement -

టి టిడిపి అధ్యక్షుడు కాసాని సంతాపం

మన తెలంగాణ / హైదరాబాద్ : వ్యవసాయ శాస్త్రవేత్త హరిత విప్లవ పితామహుడు డా.ఎం.ఎస్ స్వామినాథన్ అని ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలియ జేస్తున్నామని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు. భారతదేశంలో ఆహార ధాన్యాలైన వరి ఉత్పత్తుల కోసం..వరి ధాన్యాన్ని సృష్టించి..హరిత విప్లవానికి నాంది పలికిన గొప్ప వ్యవసాయ శాస్త్ర నిపుణుడు ఎం.ఎస్ స్వామినాథన్ అని కొనియాడారు.

ఆయన మరణం దేశంలో వ్యవసాయ రంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు. నిరంతరం వ్యవసాయ అభివృద్ధికి రైతు సంక్షేమం కోసం శ్రమించిన స్వామినాథన్ మరణం అత్యంత బాధాకరం అని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News