Friday, October 18, 2024

టిటిడిపి అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్‌ను కలిసిన నాయిబ్రహ్మణ నేతలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : టిడిపి తెలంగాణ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్‌ను నాయిబ్రహ్మణ సేవా సంఘం రాష్ట్ర నాయకులు కానుగుల శేఖర్, కానుగుల దశరథ్ మర్యాదపూర్వకంగా కలిశారు. మొదటి ఎంఎల్‌ఎ టికెట్‌ను నాయి బ్రహ్మణులకు ప్రకటించినందుకు వారు పార్టీ రాష్ట్ర అద్యక్షులకు శుభాకాంక్షలు తెలిపారు. నాయిబ్రహ్మణులను గుర్తించి మొదటి టికెట్ ప్రకటించిన మొట్టమొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా వారన్నారు. నాయి బ్రహ్మణులు టిడిపి కి ఎల్లవేళలా రుణపడి ఉంటారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్‌ను గజమాలతో సన్మానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News