Thursday, September 19, 2024

ఎంఎల్‌సి కవిత బెయిల్ మంజూరుపై బండి సంజయ్, కెటిఆర్ మధ్య ట్వీట్ వార్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీ మద్యం కేసులో ఎంఎల్‌సి కవితకు బెయిల్ రావడంపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, కేంద్రమంత్రి బండి సంజయ్‌లు ఎక్స్ వేదికగా స్పందించారు. సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు..న్యాయం గెలిచింది అని కెటిఆర్ పేర్కొనగా, కవితకు బెయిల్ రావడం అనేది బిఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండింటికీ విజయమని బండి సంజయ్ విమర్శించారు. బండి సంజయ్ ట్వీట్‌పై కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, బిజెపి, బిఆర్‌ఎస్ బంధం బయటపడిందని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంఎల్‌సి మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు.

కవితకు బెయిల్ బిఆర్‌ఎస్, కాంగ్రెస్ విజయం : బండి సంజయ్
బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవితకు బెయిల్ రావడం అనేది బిఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండింటికీ విజయమని కేంద్రమంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. బిఆర్‌ఎస్, కాంగ్రెస్ అలుపెరగని ప్రయత్నాలు ఫలించాయని ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు. బిఆర్‌ఎస్ లీడర్ బెయిల్‌పై బయటకు రావడం, కాంగ్రెస్ నేతకు రాజ్యసభ సీటు అని పేర్కొనారు. బెయిల్ కోసం వాదించిన అభ్యర్థికి మద్దతు ఇవ్వడం కెసిఆర్ రాజకీయ చతురత ప్రదర్శించారని బండి సంజయ్ విమర్శించారు.

బండి సంజయ్ వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణే
ఎంఎల్‌సి కవిత బెయిల్ విషయంలో కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కెటిఆర్ మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పుకు వక్రభాష్యం చెప్పడం సమంజసం కాదని హితవు పలికారు. సంజయ్ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు, సిజెఐ సుమోటోగా స్వీకరించాలని కోరారు. ఆయన మాటలను కోర్టు ధిక్కారంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని కెటిఆర్ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు.

బిజెపి, బిఆర్‌ఎస్ కుమ్మక్కుతోనే కవితకు బెయిల్
బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవితకు బెయిల్ ఊహించిందేనని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంఎల్‌సి మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. బిజెపి, బిఆర్‌ఎస్ కుమ్మక్కుతోనే బెయిల్ వచ్చిందని ఆరోపించారు. మొన్నటి ఎన్నికల్లో చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్‌ను దెబ్బతీయాలని చూశారని ధ్వజమెత్తారు. పార్లమెంటు ఎన్నికల్లో కుమ్మక్కై బిఆర్‌ఎస్ బిజెపికి దాసోహం అయిందని విమర్శించారు. హరీశ్‌రావు, కెటిఆర్ ఢిల్లీలో బిజెపి నేతల చుట్టూ తిరిగి ఆపద మొక్కులు మొక్కారన్నారు. బిజెపి నేతల ఇళ్ల చుట్టూ తిరిగి కాళ్లమీద పడి కవితకు బెయిల్ తెచ్చుకున్నారని దుయ్యబట్టారు. ఈ విషయాలను తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. ఇక బిజెపిలో బిఆర్‌ఎస్ విలీనం ఒక్కటే మిగిలిందని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News