Saturday, September 21, 2024

క్రైస్తవులకు తెలంగాణ సర్కార్ శుభవార్త

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : క్రైస్తవులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. క్రిస్టియన్ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ చే క్రిస్మస్ కి ముందే ఉప్పల్ బాగయత్ పరిధిలో రెండెకరాల స్థలంలో క్రిస్టియన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు మైనారిటీ సంక్షేమ హాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. రానున్న క్రిస్మస్ సందర్భంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించనున్న వేడుకల సందర్భంగా క్రిస్టియన్ వర్గాల ప్రతినిధులు, అధికారులతో మంత్రి కొప్పుల హైదరాబాద్‌లో శనివారం సమీక్ష నిర్వహించారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

ఈ నెల 21 లేదా 22 తేదీల్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున క్రిస్మస్ వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్షంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఇప్పటికే జిల్లాల పరిధిలో క్రైస్తవ మహిళలకు పంపిణీ చేయనున్న దుస్తులను మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా క్రిస్మస్ శాంపిల్ కేక్‌ను మంత్రి కొప్పుల కట్ చేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు రాజేశ్వరరావు, ఎంఎల్‌ఎ స్టీఫెన్ సన్, తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ సాగర్, మైనారిటీస్ కార్పొరేషన్ ఎండి క్రాంతి వెస్లి, జిహెచ్‌ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్, క్రిస్టియన్ అడ్వైజరీ కమిటి సభ్యులు ఎకె ఖాన్, మైనారిటీ కమిషన్ మాజీ వైస్ చైర్మన్ శంకర్ లుక్, క్రిస్టియన్ కమ్యూనిటీ నేతలు రాయడన్ రోస్, మోహన్ పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News