Monday, September 30, 2024

నక్సల్స్ అమర్చిన ఐఇడి పేలి ఇద్దరు సిఆర్‌పిఎఫ్ సిబ్బందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

Two CRPF personnel injured in IED blast by Naxals

బీజాపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో గురువారం నక్సల్స్ అమర్చిన ఐఇడి బాంబు పేలి ఇద్దరు సిఆర్‌పిఎఫ్ జవాన్లు గాయపడ్డారు. రాష్ట్ర రాజధాని రాయపూర్‌కు 400 కిలోమీటర్ల దూరంలోగల మదక్‌పల్ పోలీసు స్టేషన్ పరిధిలోనిముర్కినర్, చిన్నెకడేపల్ క్యాంపుల మధ్య అటవీ ప్రాంతంలో ఉదయం 10.45 గంటల ప్రాంతంలో ఈ సంఘటన సంభవించింది. సిఆర్‌పిఎఫ్‌కు చెందిన 170వ బెటాలియన్‌కు చెందిన బృందం గాలింపు చర్యలలో భాగంగా ఆ ప్రాంతంలో వెళుతుండగా సన్నిదుల్ ఇస్లామ్, కె బాలకృష్ణ అనే ఇద్దరు కానిస్టేబుళ్లు ఏమరుపాటున ప్రెషర్ ఐఇడి కనెక్షన్‌పై కాలు పెట్టడంతో అది పేలిపోయిందని ఐజి(బస్తర్ రేంజ్) సుందర్‌రాజ్ తెలిపారు. ఈ సంఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్ల కాళ్లకు గాయాలయ్యాయని, వారిని వెంటనే సమీపంలోని స్థానిక ఆసుపత్రికి తరలించామని ఆయన చెప్పారు. వారిద్దరూ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని, ఆ ప్రాంతంలో నక్సల్స్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News