- Advertisement -
హైదరాబాద్: నగరంలోని చంద్రాయణగుట్ట పరిధిలో విషాదం చోటుచేసుకుంది. ఉందాసాగర్ చెరువులో ఈతకు వెళ్లిన అక్కాతమ్ముడిని మృత్యువు కబలించింది. మృతులను ఫాతిమా(08), అబ్బాస్ హుస్సేన్ (04)గా గుర్తించారు. ఫాతిమా, హుస్సేన్ లు మరో సోదరుడితో కలసి చెరువులో బట్టలు ఉతికేందుకు వెళ్లినట్టు సమాచారం. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. చిన్నారుల మృతతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.
Two died while Swimming in Pond At Chandrayangutta
- Advertisement -