Tuesday, September 17, 2024

ఫ్లైవుడ్ ఫ్యాక్టరీలో పేలుళ్లు: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

two killed in explosions at plywood factory

అమరావతి: కృష్ణా జిల్లాలోని గన్నవరం మండలం సూరంపల్లి పారిశ్రామిక వాడలోని జయరాజ్ ప్లెవుడ్ కంపెనీలో గురువారం పేలుళ్లు సంభవించాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మృతదేహాలు షాపు నుంచి 50 అడుగుల దూరంలో ఎగిరిపడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఏ పదార్థం వల్ల పేలుడు సంభవించిందో గుర్తించే పనిలో పడ్డారు. మృతులు రాజరాజేశ్వరి పేటకు చెందిన అందవరపు కోటేశ్వరరావు, చిన్నారావుగా గుర్తించారు. ఈ ఘటనపై  జిల్లా ఇన్ చార్జి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటపై విచారణ జరిపించాలని మంత్రి పెద్దిరెడ్డి కలెక్టర్ ను ఆదేశించారు. మృతుల కుంటుంబాలను ఆదుకుంటామని మంత్రి తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News