Sunday, September 8, 2024

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

Two killed in road accident at Chaderghat

హైదరాబాద్: ఆర్టిసి బస్సు ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతిచెందిన సంఘటన నగరంలోని చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం తెల్లవారుజామున జరిగింది. పోలీసుల కథనం ప్రకారం…. నగరంలోని ఓల్డ్ మలక్‌పేటకు చెందిన షోహెబ్(19), ఇలాఫ్(13) ఇద్దరు చదువుకుంటున్నారు. ఇద్దరు కలిసి బైక్ వెళ్తుండగా మలక్‌పేటలోని సోహైల్ హోటల్ సమీపంలో ఆర్టిసి బస్సు ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఇద్దరు యువకుల తలపై నుంచి బస్సు టైర్ వెళ్లడంతో స్పాట్‌లోనే మృతిచెందారు. విషయం తెలుసుకున్న చాదర్‌ఘాట్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Two killed in road accident at Chaderghat

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News