Friday, April 25, 2025

పేరురు జలాశయం వద్ద లారీ బీభత్సం: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

Two Members dead in Lorry accident

అనంతపురం: పేరురు ప్రాజెక్టు వీక్షించడానికి వచ్చిన సందర్శకులపైకి లారీ దూసుకెళ్లడంతో ఇద్దరు మహిళలు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బెళుగప్ప మండలం కాల్పపల్లి వద్ద ఇద్దరు మహిళలు పేరురు ప్రాజెక్టును అందాలు చూడటానికి వచ్చారు. ఓ లారీ అతివేగంగా వచ్చి వారి పైనుంచి దూసుకెళ్లింది. వెంటనే స్థానికులు లారీని వెంబడించి బోరంపల్లి-గోళ్ల గ్రామాల మధ్య వాహనాన్ని అడ్డుకున్నారు. డ్రైవర్ కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఛిద్రమైపోయిన మృతదేహాలన స్వాధీనం చేసుకున్నారు. మృతులు లక్ష్మీదేవి, సరస్వతిగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News