- Advertisement -
చండీగఢ్: పంజాబ్లోని తరన్తరన్ జిల్లాలో ఉన్న అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఇద్దరు పాకిస్థానీ చొరబాటుదారులను బిఎస్ఎఫ్ బలగాలు కాల్చి చంపినట్లు బిఎస్ఎఫ్ అధికారి ఒకరు శనివారం చెప్పారు. శుక్రవారం రాత్రి 8.48 గంటల ప్రాంతంలో సరిహద్దు వద్ద కొంత మంది అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు బిఎస్ఎఫ్ బలగాలు గుర్తించాయని ఈ అధికారి చెప్పారు. ఆగిపోవలసిందిగా బిఎస్ఎఫ్ జవాన్లు వారిని పదేపదే హెచ్చరించనప్పటికీ వారు లక్షపెట్ట్టలేదు. దీంతో ప్రమాదాన్ని ఊహించిన బిఎస్ఎఫ్ జవాన్లు కాల్పులు జరపడంతో ఇద్దరు పాకిస్థానీ చొరబాటుదారులు మృతి చెందినట్లు ఆయన చెప్పారు.
Two Pakistani infiltrators shot dead on Punjab border
- Advertisement -