Sunday, September 8, 2024

మణిపూర్ హింసలో ఇద్దరు విలేజి వాలంటీర్ల కాల్చివేత

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్ : మణిపూర్ బిష్ణుపూర్ జిల్లాలో ఆదివారం ఇద్దరు విలేజి వాలంటీర్లను సాయుధులైన దుండగులు కాల్చి చంపారు. ఈ సంఘటన కొయిజుమంటాబి గ్రామంలో జరిగింది. విలేజి వాలంటీర్లు బంకర్‌కు కాపలా ఉండగా, కాల్పులు జరిగాయని పోలీస్‌లు చెప్పారు. ఇప్పటికీ కాల్పులు కొనసాగుతున్నాయని, మరణాల సంఖ్య ఇంకా పెరగవచ్చని తెలిపారు. మణిపూర్‌లో మెయితేయి, కుకీ వర్గాల మధ్య చెలరేగిన హింసకు ఇప్పటివరకు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News