Sunday, September 8, 2024

తుఫాన్ ఎఫెక్ట్…. తిరుమలలో నిండిన ఐదు జలాశయాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: తుఫాను ప్రభావంతో టిటిడి చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆఫ్ సీజన్ లో ఐదు డ్యాములు నిండాయి. పూర్తిస్థాయిలో జలాశయాలు నిండటంతో నీటి నిల్వలతో డ్యాములు కళకళలాడతున్నాయి. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం టిటిడి తిరుమలలో ఐదు జలాశయాలు నిర్మించింది. భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుండడంతో అందుకనుగుణంగా నీటి వాడకం పెరుగుతూ రావడంతో నిల్వలకోసం టిటిడి డ్యాములను నిర్మిస్తూ వచ్చింది. మొదటి డ్యామ్ గోగర్భం డ్యాం కు పూర్తి స్థాయిలో నీళ్ళు చేరుకోవడంతో మరి కాసేపట్లో (వార్త రాసే సమయానికి) గేట్లు ఎత్తి నీరును లోతట్టు ప్రాంతానికి విడుదల చేయడానికి టిటిడి వాటర్ వర్క్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

గోగర్భం డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 2894 అడుగులకు గాను 2887 అడుగులకు మేర నీళ్ళు చేరుకోవడంతో టిటిడి అధికారులు అప్రమత్తమయ్యారు. తర్వాత చిన్నదైన ఆకాశగంగ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 865 మీటర్లకు గాను 859.80 మీటర్ల మేర నీరుచేరి ఉప్పొంగి ప్రవహిస్తుంది. పాపవినాశనం డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 697.14 మీటర్లు కాగా ఇప్పటికే 693.60 మీటర్లకు చేరుకుంది.ఇక జంట ప్రాజెక్టులైన కుమారధార డ్యాం పూర్తి సామర్థ్యం 898.24 మీటర్లు కాగా 896.20 మీ. మేరకు వరద నీరు చేరుకుంది. పసుపు ధార డ్యాం సామర్థ్యం 898.28 ఉండగా 895.90 మీటర్ల మేరకు నీరు చేరింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News