Sunday, February 23, 2025

U19 WC Semifinal: భారత్ లక్ష్యం 245 పరుగులు

- Advertisement -
- Advertisement -

బినోని: విల్లోమూర్ పార్క్ వేదికగా జరుగుతున్న అండర్19 వరల్డ్ కప్‌ 2024 సెమీఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా, భారత్ జట్టుకు 245 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయిన 244 పరుగులు చేసింది.  లాన్ డ్రీ ప్రీటోరయిస్(79 పరుగులు), రిచర్ట్ సీలెట్‌ష్వాన్(64 పరుగులు)లు అర్థ శతకాలతో రాణించారు.

చివర్లో ట్రిస్టన్ లూస్(12 బంతుల్లో 23 పరుగులు నాటౌట్) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. మిగతా బ్యాట్స్ మెన్లు ఘోరంగా విఫలమయ్యారు. దీంతో భారత్ ముందు భారీ టార్గెట్ ను ఉంచలేకపోయింది. భారత బౌలర్లలో రాజ్ లింబాని మూడు వికెట్లు పడగొట్టగా, ముషీర్ ఖాన్ రెండు వికెట్లు తీశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News