Tuesday, July 2, 2024

చదువురాని అవివేకులు పాలకులైతే?

- Advertisement -
- Advertisement -

2015లో ఎన్‌డిటివికి ఇచ్చిన ఇంటర్వూలో స్వయంగా లాల్ కృష్ణ అద్వానీ ఇలా చెప్పారు. ‘నలభై ఏళ్ళ క్రితం ఇందిరా గాంధీ పరిపాలనలో విధించిన ఎమర్జెన్సీ వదిలేయండి. అది కేవలం కొన్ని నెలలు మాత్రమే ఇప్పుడు మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం ఎమర్జెన్సీలోనే ఉంది. ఏళ్లకేళ్లు గడిచినా అనధికార, అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది”! భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మీద అక్కసుతో నెహ్రూ జన్మస్థలమైన అలహాబాద్ పేరు మార్చి ప్రయాగ్‌రాజ్ అన్నారు. ఢిల్లీలోని నెహ్రూ మ్యూజియం పేరు మార్చి పి.ఎం మ్యూజికం అన్నారు. అందులో ఉన్నవన్నీ నెహ్రూ వస్తువులే. ఇతర ప్రధానుల జ్ఞాపక చిహ్నాలేవీ లేవు. ఈ పేరు మార్చే రోగం ఈ ప్రభుత్వానికి ఎందుకు పట్టిందో తెలియదు. వీరు పెట్టిన పేర్లు చిరకాలం ఉంటాయా?

పుస్తకాల గది నుండి వచ్చేవారే ఈ సమాజానికి అవసరం. పూజ గది నుండి వచ్చేవారు బహుశా.. పునర్జన్మలకు మాత్రమే అవసరమేమో ఆర్దర్ జాన్, అమెరికన్ సైకియాట్రిస్ట్. పుస్తకాల గురించి, పుస్తకాలు చదవడంలోని ఆనందం గురించి భారత రాజ్యాంగ నిర్మాత డా. బిఆర్ అంబేడ్కర్ ఇలా రాసుకున్నారు పుస్తక ప్రేమికులకు, అధ్యయన శీలురకు ఆయన మాటలు తప్పకుండా స్ఫూర్తినిస్తాయి ‘నేను చదివిన పుస్తకంలోని తత్వాన్ని బయటకు తీస్తాను. అవసరం లేని భాగాన్ని వదిలేస్తాను. ‘జ్ఞానం అనేది శక్తి.

ఆనంద సాధనం’ అన్న హైంజలైట్ అన్న మాటలు అక్షర సత్యం! పుస్తకం చదవడం మొదలు పెట్టగానే నాకు అనంతమైన సుఖానుభవం కలుగుతుంది. చదవడంలో నాకు కలిగే ఆనందం వర్ణింపనలవికానిది… నాకు బాధ కలిగించే విషయమేమంటే చాలా మంది మనవాళ్ళు చదవరు. అధ్యయనం లేకుండా జ్ఞానం జ్ఞానం లేకుండా శక్తీ రావు. ఎవరితోనైనా తలపడే ముందు మనం జ్ఞానంతో, శక్తియుక్తులతో సమర్థవంతంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ చదివే అభిరుచిని పెంచుకోవాలి. నేను వెనిస్ నుండి బొంబాయికి ప్రయాణిస్తూ ఆరు రోజుల్లో ఎనిమిది వేల పేజీలు చదివాను. మరోసారి అరవై నాలుగు గంటల పాటు ఒక పుస్తకాన్ని అది పూర్తయ్యే వరకు చదివాను.

పుస్తకాలు దీపాల వంటివి. అవి మనో మాలిన్యమనే చీకటిని తొలగిస్తాయి. నేను నా భార్యా బిడ్డల కంటే పుస్తకాలనే ఎక్కువగా ప్రేమిస్తాను. విద్యా వికాసాలు పొందాలి. విద్యా వికాసాల్ని ఇతరులకు అందించాలి. అంతర్గతంగా ఆందోళన పడాలి. మార్పుకోసం ఆందోళన చేయాలి. సంఘటిత పడాలి. సమైక్యంగా ముందుకు సాగాలి. ఒక దేవాలయ నిర్మాణం కంటే ఒక గ్రంథాలయ నిర్మాణం ఎన్నో లక్షల రెట్లు గొప్పది. దేవాలయం ముష్టివాళ్లను సృష్టిస్తే గ్రంథాలయం దేశాన్ని మార్చే మహావీరుల్ని సృష్టిస్తుంది” అని అన్నారు డా. బిఆర్ అంబేడ్కర్. మానవీయ విలువల దృష్టికోణంతో అంబేడ్కర్ కృషిని బేరీజు వేస్తే అది ఇలా ఉంటుంది. “ఇన్సానోంకొ గులాం బనాకర్/ హజారోఁ బాదుషా బనేహ/ లేకిన్ గులామోంకో ఇన్‌సాన్ బనాకర్/ సిర్ఫ్ ఏక్ హి బాద్‌షా బనేహ ఓ హై డా. బీమ్‌రావ్ రామ్‌జీ అంబేడ్కర్!” అంటే అర్థం మనుషుల్ని బానిసలుగా చేసి వేల మంది చక్రవర్తులయ్యారు. కాని, బానిసల్ని మనుషులుగా చేసిన చక్రవర్తి ఒకే ఒక్కడు ఆయనే డా. బీమ్‌రావ్ రామ్ జీ అంబేడ్కర్.

ఆయన విద్యార్హతలు కూడా ఒకసారి గమనిద్దాం. ఫాసిస్టులకు అంబేడ్కర్ అంటే పడదు. కాలాలకు అతీతంగా అత్యున్నతమైన విద్య నార్జించిన ఆర్థిక వేత్త అయ్యాడని ఉడుకుమోతు తనం! ఆయన విద్యార్హతలు ఏ కాలంలోనైనా ఆశ్చర్యం కలిగించేవే! 1917 పిహెచ్‌డి కొలంబియా యూనివర్శిటీ. 1921లో ఎంఎస్‌సి అండన్ స్కూల్ ఆప్ ఎకనమిక్స్. 1922 30 సెప్టెంబర్, బారిస్టర్ ఎట్ లా గ్రేట్ బ్రిటన్, లండన్. 1923 నవంబర్ డిఎస్‌సి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్. 1952 గౌరవ డాక్టరేట్ ఎల్‌ఎల్‌డి కొలంబియా యూనివర్శిటీ. 195312 జనవరి డి.లిట్ గౌరవ డాక్టరేట్. ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాద్. రెండు మాస్టర్స్ డిగ్రీలు, నాలుగు డాక్టరేట్లు. ఇన్ని డిగ్రీలు ఇంత జ్ఞాన సంపదను సంపాదించిన భారతీయుడిగాగుర్తించి, న్యూయార్స్ కొలంబియా యూనివర్శిటీలో ఆయన విగ్రహం ప్రతిష్టంచారు. అదీ ఎందుకూ? జ్ఞాన సంకేతంగా ‘సింబల్ ఆఫ్ నాలెడ్జ్’గా గౌరవించారు.

చదువుకు, విజ్ఞతకు, సమాజోద్ధరణకు అవినాభావ సంబంధం ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉండి, మన దేశాన్ని ఫాసిస్ట్ ధోరణిలోకి నెట్టేస్తున్న వారి విద్యార్హతలేమిటీ? వారి వివేకం ఎక్కడా? మత విద్వేషాలు రెచ్చగొట్టి మారణకాండలు సృష్టించడమే పనిగా పెట్టుకున్న వీరు, చరిత్ర హీనులుగా మిగలరా? ఆరో తరగతిలో బడి నుండి పారిపోయిన వాడిని వెతుక్కొచ్చి రాజ్యాధికారం కట్టబేడితే ఏమవుతుంది? పిచ్చోడి చేతి లో రాయి అవుతుంది. బ్రిటీష్ రాజనీతిజ్ఞుడు ఫ్రాన్సిస్ బేకన్ చెప్పిన ఈ మాట ఎంత గొప్పగా ఉందో ఆలోచించండి. ‘చదువు మనిషిని పూర్తిగా మానవుడిగా తీర్చిదిద్దుతుంది. చర్చ సంసిద్ధ మానవుడిగా తీర్చిదిద్దుతుంది.

రాత ఖచ్చితమైన మానవుడిగా తీర్చిదిద్దుతుంది’. చదువుకున్న వివేకవంతులకే సోషలిజం విలువ తెలుస్తుంది. చదువు, సంస్కారం, మానవీయ విలువలపై గౌరవ భావంలేని పాలకులు కేవలం జంగిల్ రాజ్యం స్థిరపరిచి, ఆటవిక పాలనను అందించగలరు. ప్రజల బతుకులు అభద్రతలోకి తోసేయగలరు. సోషలిజం సమాజంలో చాలా మార్పులు తెస్తుందని, ప్రజలందిరికీ అవసరమైన ఆహారం, గృహ వసతి అందిస్తుందని, మానవుల మధ్య వర్గ విభజనలు తొలగిస్తుందని, ఆర్థిక వ్యవస్థలో ప్రజాతంత్రయుతమైన ప్రణాళికను ప్రవేశపెడుతుందని, ప్రపంచ శాంతి సమైక్యతల్ని నెలకొల్పుతుందని ప్రసిద్ధ సామాజిక ఆర్థిక వేత్తలంతా చెపుతూనే ఉన్నారు.

ఇలాంటి పరిస్థితిని గమనించి కాబోలు మావో జెడుంగ్ ఓ మాట చెప్పారు “అధ్యయనం లేకుండా ఒక పరిష్కారం కనుగొనాలనుకునేవారు లేక ఒక ఆలోచనకు రావాలనుకునేవారు కేవలం తెలివి తక్కువ దద్దమ్మలు మినహా మరేమీ కాదు. అలా చేస్తే సరైన పరిష్కారం లభించడం గాని, మంచి ఆలోచనకు రావడం గాని జరగదన్న విషయం తెలుసుకోవాలి!’ తమ మూర్ఖపు ప్రకటనలతో జనాన్ని వెనక్కి నడిపించాలని ప్రయత్నిస్తున్న నేటి మన ఆలోచచన లేని పాలకులకు అధ్యయనం ఆలోచన వంటి మాటలకు అర్థాలు తెలుస్తాయా? అదేమిటో మన దేశంలోనే చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. పదో తరగతిలో ఫెయిల్ అయిన క్రికెటర్ సచిన్ ‘భారత రత్న’ అయ్యాడు. పెట్రోల్ బంక్‌లో పని చేసిన అంబానీ కోట కోట్లకు అధిపతి అయ్యాడు. రైల్వేస్టేషన్‌లో చాయ్ అమ్ముకున్నానన్న వాడు దేశానికి ప్రధాని అయ్యాడు.

కాని చూడండి క్లాసులోకి రానివ్వకపోతే క్లాసు బయటే కూర్చుని చదువుకున్న దళిత బాలకుడు భీమ్‌రావ్ అంబేడ్కర్, ఈ దేశపు శిల్పి అయ్యాడని అంటే ఒప్పుకోరు ఎందుకూ? దేశానికి రాజ్యాంగాన్ని సమకూర్చి, దేశానికో అందమైన ఆకృతినిచ్చాడంటే పట్టించుకో రెందుకూ? ప్రపంచంలోనే జ్ఞానానికి ప్రతీక SYMBOL OF KNOWLEDGE అయ్యాడని గర్వంగా చెప్పుకోరెందుకూ? న్యూయార్క్ కొలంబియా విశ్వవిద్యాలయంలోనే ఆయన స్మృతి చిహ్నం జ్ఞాన ప్రతీకగా ఉంది కదా? దేశాన్ని హిందూ దేశంగా మార్చడం కాదు గాని, వారి పాలనలో ఉన్న ఒక రాష్ట్రంలో ఒక చిన్న ఊరిని పూర్తి హిందూ గ్రామంగా మార్చి చూపించమనండి.. చూద్దాం! చంద్రుడి మీద నీరు లేదని అంటే ఏం చేస్తారూ.భూమి మీది నుంచి అక్కడికి గో మూత్రం తీసుకుపోతారా? ఒకాయన చంద్రుణ్ణి ‘హిందూ దేశ్’ గా ప్రకటించాలన్నాడు. మరో ఆ ఫలానా పార్టీ ఎంపి అయితే మతి భ్రమించినట్టు మాట్లాడాడు. చంద్రుణ్ణి భారత్ జయించిందనీ మళ్లీ ఆ ఫలానా పార్టీనే అధికారంలోకి తీసుకొస్తే.. తాము చంద్రుడి మీద ఒక్కొక్కరికి మూడు ఎకరాలు పంచిపెడతామని ప్రకటించాడు. కోతలు కోయడమే ఆ ఫలానా పార్టీ పాలసీ అయినప్పుడు ఇక దానికి హద్దులెందుకూ? అని అనుకుని ఉంటారు. ఒకడు మనుషులను పశువుల కంటే హీనంగా చూస్తాడు. విద్వేషాలు రెచ్చగొడతాడు. తన ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని ‘జంగిల్ రాజ్’గా మారుస్తాడు. మరొకడు ఆవు మూత్రం సీసాల్లో నింపి, అందంగా ప్యాక్ చేసి, లీటర్ రూ. 120/ నుండి రూ. 1040/ వరకు అమ్ముకుంటాడు. ఆయనో నకిలీ మెల్లెకన్ను బాబా. ఇలాంటి వారంతా ఈ దేశం లో గొప్ప తాత్వికవేత్తలంట! వీళ్ల గూర్చి విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు పాఠాలు చదువుకోవాలంట! దేశం ఎటు పోతున్నది? ఎవరు రక్షిస్తారీ దేశాన్ని? దేశ ప్రజలు ఆలోచించరా? మేలుకోరా? కర్తవ్యోన్ముఖులు కారా? 2015లో ఎన్‌డిటివికి ఇచ్చిన ఇంటర్వూలో స్వయంగా లాల్ కృష్ణ అద్వానీ ఇలా చెప్పారు.

‘నలభై ఏళ్ళ క్రితం ఇందిరా గాంధీ పరిపాలనలో విధించిన ఎమర్జెన్సీ వదిలేయండి. అది కేవలం కొన్ని నెలలు మాత్రమే ఇప్పుడు మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం ఎమర్జెన్సీలోనే ఉంది. ఏళ్లకేళ్లు గడిచినా అనధికార, అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది”! భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మీద అక్కసుతో నెహ్రూ జన్మస్థలమైన అలహాబాద్ పేరు మార్చి ప్రయాగ్‌రాజ్ అన్నారు. ఢిల్లీలోని నెహ్రూ మ్యూజియం పేరు మార్చి పి.ఎం మ్యూజికం అన్నారు. అందులో ఉన్నవన్నీ నెహ్రూ వస్తువులే. ఇతర ప్రధానుల జ్ఞాపక చిహ్నాలేవీ లేవు. ఈ పేరు మార్చే రోగం ఈ ప్రభుత్వానికి ఎందుకు పట్టిందో తెలియదు. వీరు పెట్టిన పేర్లు చిరకాలం ఉంటాయా? వీరు అధికారంలోంచి దిగిపోగానే, వీరు పెట్టిన పేర్లు కూడా ‘హుష్‌కాకి’ అయిపోవా? సమకాలీన రాజకీయ పరిస్థితులు చూసి సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఇలా వ్యాఖ్యానించారు “మోడీ కాకపోతే ఇంకెవరూ? అని అడుగుతారు.

అయిదేళ్లలో ఆయన ఏం చేశారో చూడండి. ఐదు కోట్ల ఉద్యోగాలు గాలికెగిరిపోయాయి. రైతులు సంక్షోభంలో కూరుకుపోయారు. న్యాయ వ్యవస్థ, ఎన్నికల సంఘం, కాగ్, లోక్‌పాల్, సిబిఐ, ఎన్‌ఐఎ, మీడియా అన్నింటినీ వశపరుచుకున్నారు. మూక దాడులు, ద్వేష పూరిత అబద్ధపు ప్రకటనలు ప్రధాన వార్తా స్రవంతిలో, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. వీరికే గనక ఈ దేశ ప్రజలు మరోసారి అవకాశమిస్తే ఇక అంతే నాగరికత అంతరించినట్టే!” మనమెంత ప్రమాదకరమైన వాతావరణంలో ఉన్నామన్నది ఇలాంటి వివేకవంతుల మాటల్లోంచి గ్రహించుకోవాలి! అందుకే సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ దేశ ప్రజల్ని ఉద్దేశించి హెచ్చరికలు చేస్తూ తన మద్దతు కూడా తెలిపారు.“మాకు సాధ్యమైనంత వరకు మేం, భారత రాజ్యాంగాన్ని సంరక్షించడానికి ప్రయత్నిస్తున్నాం. కాని, మాకు ప్రజల అండదండలు కూడా చాలా అవసరం. ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి రావాలి. వారి హక్కుల కోసం వారు ఈ నిరంకుశ ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఇది ప్రజల హక్కులు హరిస్తోంది. భయాందోళనలకు గురి చేస్తోంది. అయి నా ప్రజలు తగ్గకూడదు. భయపడకూడదు. ధైర్యంగా ముందుకు రావాలి. ప్రభుత్వాన్ని వివరణలు అడగాలి. లెక్కలు తేల్చమనాలి. ప్రభుత్వాలెప్పుడూ ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిందే! ధైర్యంగా ఉండండి! నేను మీతోనే ఉన్నాను!!” అని అన్నారు.

డాక్టర్
దేవరాజు మహారాజు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News