Monday, February 24, 2025

పాపం పసికందు

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డిః అప్పుడే పుట్టిన ఆడశిశువును గ్రామ పంచాయితీ కార్యాలయం ముందు వదిలేసిన అమానవీయ సంఘటన సంగారెడ్డి మండల పరిథిలోని కలబ్‌గూర్ గ్రామ పంచాయితీ ముందు చోటుచేసుకుంది. మంగళవారం ఎస్‌ఐ రాజేష్ నాయక్ తెలిపిన కథనం ప్రకారం… ఉదయం 9గంటల ప్రాంతంలో కలబ్‌గూర్ గ్రామ పంచాయితీ కార్యాలయ ఆవరణలో అప్పుడే పుట్టిన ఆడ శిశువును గుర్తు తెలియని మహిళ వదిలి వెళ్లిందన్నారు.

విషయం తెలుసుకున్న సర్పంచ్ మంజుల ఆమె భర్త పండరినాథ్‌గౌడ్‌లు పాపను చేరదీసి పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పాపను సర్పంచ్ పోలీసులు సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాపను స్పెషల్ న్యూబార్ప్‌కేర్ యూనిట్‌కు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నామని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ అనిల్ కుమార్ తెలిపారు. పాప ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన తెలిపారు. శిశువు ఎవరు, శిశువును ఎవరు వదిలి వెళ్లారనేదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News