- Advertisement -
హైదరాబాద్: ఉత్తర ప్రదేశ్ మాజీ సిఎస్ కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొండాపూర్లో డ్రగ్స్ సప్లయ్ చేస్తుండగా ఎక్సైజ్ పోలీసులు అతడిని పట్టుకున్నారు. రూ.40 లక్షల విలువైన ఒజికుష్ డ్రగ్స్ను అతడి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్లోని ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రోజు రోజుకు హైదరాబాద్ డ్రగ్స్ దందా మితిమీరిపోతుంది. హైదరాబాద్ డ్రగ్స్ అడ్డగా మారిపోయింది.
- Advertisement -