సీతాపూర్: ఆడుతూ పాడుతూ.. పొరుగింటికి వెళ్లడమే ఆ ఐదేళ్ల చిన్నారి ప్రాణాలను బలిగొంది. తనతో సఖ్యత లేని ఇంటికి వెళ్లిందని కన్న కూతురిని దారుణంగా హత్య చేసి.. ఆమె శరీరాన్ని ముక్కలు చేశాడో కసాయి తండ్రి. ఉత్తర్ప్రదేశ్లోని సీతాపూర్లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 25వ తేదీన చిన్నారి కనిపించడం లేదంటూ.. కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారట. అయితే చిన్నారి కోసం వెతుకుతున్న క్రమంలో ఆమె శరీర భాగం ఒకటి కనిపించగా.. మరుసటి రోజు మిగితా భాగాలన్ని లభ్యమైనట్లు తెలిపారు. అప్పటితో చిన్నారి హత్యకు గురైనట్లు ఓ స్పష్టత వచ్చిందని సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు.
కానీ, ఎవరు హత్య చేశారని అనుమానితుల్ని ప్రశ్నిస్తున్న తరుణంలో చిన్నారి తండ్రి మోహిత్ కనిపించకుండా పోయాడట. తన ఫోన్ని భార్యకు ఇచ్చి.. తాను ఎక్కడికో వెళ్లిపోయాడని పోలీసులు చెప్పారు. చిన్నారి కనిపించకుండా పోయే ముందు ఈ తతంగం జరిగిందని పేర్కొన్నారు. అయితే తండ్రి దొరికిన తర్వాత అతన్ని ప్రశ్నించగా.. తానే హత్య చేసి.. మృతదేహాన్ని ముక్కలు చేసినట్లు అంగీకరించాడని తెలిపారు.
అసలు విషయానికొస్తే.. మోహిత్, పొరుగింటిలో ఉండే రాముతో ఒకప్పుడు మంచి స్నేహం ఉండేది. తరచూ ఒకరింటికి ఒకరు వస్తూ పోతుండే వాళ్లు. కానీ, కొన్ని రోజుల క్రితం వీరిద్దరి మధ్య వివాదం వచ్చి విడిపోయారు. దీంతో మోహిత్ తన కూతురిని రాము ఇంటికి వెళ్లొద్దంటూ చాలాసార్లు హెచ్చరించాడు. కానీ, ఆ చిన్నారి అక్కడికే వెళ్లి ఆడుకునేదట. దీంతో చిన్నారి రాము ఇంటి నుంచి వస్తుండగా.. గమనించిన మోహిత్ కోపంతో ఆమెను బండి మీద ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి ఆమె బట్టలతోనే గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత ఆమె శవాన్ని పొలాల్లో పడేశాడు. ఇంత దారుణానికి ఒడిగట్టిన మోహిత్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసును త్వరగా పరిష్కరించిన పోలీసులను సీనియర్ అధికారులు అభినందించారు.