Monday, March 31, 2025

ప్రపంచ వాణిజ్య సంస్థకు ట్రంప్ షాక్

- Advertisement -
- Advertisement -

ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్లుటీవో)కు అమెరికా నుంచి వెళ్లే నిధులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కత్తర వేశారు. ఈ విషయాన్ని ఓ ఆంగ్లవార్తా సంస్థ వెల్లడించింది. ట్రంప్ కార్యవర్గం అనుసరిస్తున్న వ్యాపార రక్షణాత్మక వైఖరిని మరింత బలోపేతం చేసుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకొన్నారు. ట్రంప్ అధికారం లోకి వచ్చింది మొదలు ప్రపంచ స్థాయి వేదికల నుంచి అమెరికాను పక్కకు తప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఇప్పటికే ప్రపంచ ఆరోగ్యసంస్థ నుంచి అమెరికా వైదొలిగినట్టు ప్రకటించారు. తాజాగా డబ్లుటీవోకు నిధులను నిలిపివేశారు. దీంతోపాటు అనేక దేశాలకు అందించే విదేశీ సాయాన్ని కూడా నిలిపివేశారు. వాస్తవానికి 2019 లోనే ట్రంప్ డబ్లుటీవోను బలహీనపర్చారు. నాడు ఆ సంస్థలో న్యాయమూర్తుల నియామకాలను ఆయన నిలిపివేశారు. దీంతో ఆ సంస్థ వివాద పరిష్కార వేదిక విభాగం బలహీనపడిపోయింది. ఇది తరచూ తన పరిధిని దాటి మరీ తీర్పులు ఇస్తోందని ఎప్పటినుంచో వాషింగ్టన్ ఆరోపిస్తోంది.

2024లో డబ్లుటివో నిర్వహణకు 232 మిలియన్ డాలర్లు ఖర్చయ్యాయి. ప్రపంచ వాణిజ్యం ప్రతిదేశం వాటా ఆధారంగా ఈ సంస్థకు నిధులు సమకూరుస్తారు. ఇక అమెరికా నుంచి దీనికి దాదాపు 11 శాతం అందుతాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన అదనపు సుంకాలు ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి రానున్నాయి. మరోవైపు ఈ వారమే అమెరికా దిగుమతి చేసుకునే కార్లపై 25 శాతం సుంకాలను ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన అమెరికాను డబ్లుటీవో నుంచి పక్కకు తెస్తారనే ప్రచారం జోరందుకొంది. అక్టోబర్ 2 నుంచి ట్రంప్ లిబరేషన్ డే అని అభివర్ణిస్తున్నారు. కొత్త పన్నుల నుంచి అమెరికా ప్రభుత్వానికి 100 బిలియన్ డాలర్ల ఆదాయం రానుందని శ్వేతసౌధం వర్గాలు అంచనా వేశాయి. కాకపోతే ఈ నిర్ణయాలు ప్రపంచ పంపిణీ వ్యవస్థలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే అమెరికా నిర్ణయాలను డబ్లుటీవోలో సవాలు చేస్తామని చైనా వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News