Tuesday, September 17, 2024

‘ఉషా పరిణయం’ వచ్చేది అప్పుడే

- Advertisement -
- Advertisement -

తెలుగు చిత్రపరిశ్రమలో ప్రముఖ దర్శకుల్లో ఒకరైన కె. విజయ్ భాస్కర్ స్వీయ దర్శకత్వంలో మరో సరికొత్త ఫీల్ గుడ్ ఫ్యామిలి ఎంటర్‌టైనర్ రాబోతోంది.ఉషా పరిణయం అనే టైటిల్‌తో ఫ్యామిలి ఎంటర్‌టైనర్‌ను విడుదలకు సిద్దం చేశారు. ఈ చిత్రాన్ని విజయభాస్కర్ క్రాఫ్ట్ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తోంది. విజయ్ భాస్కర్ తన తనయుడు శ్రీకమల్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తున్నాడు. ఈ చిత్రంలో కథానాయికగా తాన్వి ఆకాంక్ష అనే తెలుగమ్మాయి పరిచయం కాబోతోంది. ఆగస్టు 2న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ’సరికొత్త ప్రేమ కథతో అన్నీ ఎమోషన్స్ తో ఉండే మంచి లవ్ స్టోరీ ఇది. సినిమా లవర్స్‌కు ఇదొక విందు భోజనంలా ఉంటుంది”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News