Thursday, September 19, 2024

అక్కాచెల్లెళ్లపై మాంత్రికుడు అత్యాచారం

- Advertisement -
- Advertisement -

లక్నో: మాంత్రికుడు అక్కాచెల్లెలుపై అత్యాచారం చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని మథురలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఢిల్లీలోని  ఇద్దరు యువతులకు(కజీన్స్) అనారోగ్య సమస్యలు ఉండడంతో బంధువులలో దినేష్ కుమార్ అనే వ్యక్తిని తల్లితండ్రులు కలిశారు. యుపిలో మథురులో నందల్ జాతవ్ అనే తాంత్రికుడు ఉన్నాడని అనారోగ్య సమస్యల నుంచి బయట పడేస్తాడని యువతుల కుటుంబ సభ్యులకు అతడు తెలిపాడు. ఇద్దరు యువతులు తన తల్లులతో కలిసి తాంత్రికుడి వద్దకు చేరుకున్నారు. తాంత్రికుడు పూజలు చేయడానికి రూ.20 వేలు అవసరం అవుతాయని చెప్పాడు. తాంత్రికుడికి 20 వేల రూపాయలు వారు ముట్టజెప్పారు. పూజల పేరుతో ఇద్దరు యువతులను వేర్వేరు రూమ్‌లలో ఉంచి వారిపై తాంత్రికుడు అత్యాచారం చేశాడు. వారిపై అత్యాచారం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దినేష్ అనే వ్యక్తి తన బంధువుల పిల్లలపై మాంత్రికుడు అత్యాచారం చేశాడని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాంత్రికుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News