Thursday, September 19, 2024

 ‘వచ్చినవాడు గౌతం‘ ఫస్ట్ లుక్ విడుదల..

- Advertisement -
- Advertisement -

యాక్షన్ థ్రిల్లర్ ‘హిడింబ’తో హిట్ కొట్టి జోరు మీదున్న ట్యాలెంటెడ్ హీరో అశ్విన్ బాబు తన నెక్స్ట్ ప్రాజెక్టును ప్రకటించారు. అశ్విన్ బాబు 8వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ మూవీకి మామిడాల ఎంఆర్ కృష్ణ దర్సకత్వం వహించనున్నారు. సోమవారం అశ్విన్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ తోపాటు ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. ‘వచ్చినవాడు గౌతం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మెడికో థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది.

షణ్ముఖ పిక్చర్స్‌పై ఆలూరి సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆలూరి హర్షవర్ధన్ చౌదరి సమర్పిస్తున్నారు.
గౌర హరి సంగీతం అందిస్తుండగా, శ్యామ్ కె నాయుడు కెమెరా మెన్ గా పని చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్, ఇతర వివరాలు త్వరలో మేకర్స్ వెల్లడించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News