- Advertisement -
లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం వారణాసిలో 19 ఏళ్ల యువతిపై 23 మంది నిందితులు అత్యాచారానికి పాల్పడిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. వారణాసి పోలీసులు, కలెక్టర్తో ప్రధాని మోడీ మాట్లాడారు. నిందితులలో తొమ్మిది మందిని అరెస్టు చేశామని పోలీసులు మోడీకి తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని యుపి పోలీస్ ఉన్నతాధికారులకు ఆదేశించారు. ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో 23 మంది నిందితులు ఓ 19 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసి పలు ప్రదేశాలలో ఆమెపై సామూహిక అత్యాచారం చేసిన విషయం తెలిసిందే.
- Advertisement -