Monday, March 3, 2025

రంజీ టైటిల్ విజేత విదర్భ

- Advertisement -
- Advertisement -

డ్రాగా ముగిసిన ఫైనల్ మ్యాచ్
తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో విదర్భ గెలుపు

నాగ్‌పూర్: ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ టైటిల్‌ను విదర్భ సొంతం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్ ఫలితం తేలకున్నా విదర్భను టైటిల్ వరించింది. కేరళతో ఆదివారం జరిగిన టైటిల్ పోరు మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించిన విదర్భను అంపైర్లు విజేతగా ప్రకటించారు. రంజీ ట్రోఫీ చరిత్రలో విదర్భ జట్టుకు ఇది మూడో టైటిల్. గత 7 ఏళ్లలోనే ఈ మూడు టైటిల్ అందుకోవడం విశేషం. ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీని తృటిలో చేజార్చుకున్న విదర్భ.. రంజీ ట్రోఫీని ఒడిచిపట్టుకుంది. విదర్భ విజయంలో టీమిండియా వెటరన్ బ్యాటర్ కరుణ్ నాయర్ కీలక పాత్ర పోషించారు. రెండు ఇన్నింగ్స్‌ల్లో అద్భుత బ్యాటింగ్‌తో రాణించాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యా టింగ్ చేసిన విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 123.1 ఓవర్లలో 379 పరుగులకు ఆలౌటైంది. డానిష్ మలెవర్ 153 (285 బంతుల్లో 15×4, 3×6) సెంచరీతో చెలరేగగా.. కరుణ్ నాయర్(86) తృటిలో శతకం చేజార్చుకున్నాడు. అనంతరం కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 125 ఓవర్లలో 342 పరుగులే చేసింది. కెప్టెన్ సచిన్ బేబీ(98) సెం చరీ చేజార్చుకోగా.. ఆదిత్య సర్వతే(79) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. దాంతో తొలి ఇన్నింగ్స్ లో విదర్భకు 37 పరుగుల స్వల్ప ఆధిక్యం సా ధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన విదర్భ 143.5 ఓవర్లలో 9 వికెట్లకు 375 పరుగులు చేసింది. కరుణ్ నాయర్(135 ) సెంచరీతో చెలరేగగా..

డాని మలేవర్(73), దర్శన్ నల్కండే(51 నాటౌట్) హాఫ్ సెంచరీల తో కదంతొక్కారు. ఆటకు చివరి రోజు కావడం విదర్భ తన బ్యాటింగ్ కొనసాగిస్తుండటంతో మ్యాచ్ ఫలితం తేలే అవకాశాలు లేకపోవడం తో అంపైర్లు ఇరు జట్ల కెప్టెన్ల అంగీకారంతో మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించిన విదర్భను విజేతగా పేర్కొన్నారు. విజయ్ హజారే ట్రోఫీలో వరుస సెంచరీలతో చెరలేగిన కరుణ్ నాయర్ కీలకమై న ఫైనల్లో మాత్రం తడబడ్డాడు. దాంతో ఆ జ ట్టు విజయ్ హజారే ట్రోఫీని అందుకోలేకపోయింది. కానీ రంజీ ట్రోఫీ ఫైనల్లో మాత్రం నాయర్ మెరుగైన ఆటతోపాటు జట్టును ముం దుండి నడిపి విదర్భకు టైటిల్ అందించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News