Sunday, September 8, 2024

ఆ బిడ్డకు తండ్రి ఎవరు… విజయసాయిరెడ్డికి డిఎన్ఎ టెస్టు చేయాలి : శాంతి భర్త

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి, ఆయన అనుచురుడు పోతిరెడ్డి సుభాష్ రెడ్డిలు తన భార్య శాంతిని రాజకీయ ప్రొద్బలంతో వాడుకున్నారని ఆమె భర్త మదన్‌మోహన్ ఆరోపణలు చేశారు. తన భార్య శాంతను శారీరకంగా విజయసాయి రెడ్డి వాడుకొని బిడ్డను కన్నారని ఆయనకు డిఎన్‌ఎ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో వివిధ దళిత, గిరిజన, బహుజన సంఘాలతో కలిసి ఆయన ధర్నా చేశారు. ఈ సందర్భంగా మదన్ మోహన్ మాట్లాడారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిని అడ్డం పెట్టుకొని దేవాదాయ శాఖకు చెందిన రూ.1000 కోట్ల భూమని కొల్లగొట్టారని మదన్ విమర్శలు గుప్పించారు.

గిరిజనులకు అన్యాయం చేసిన విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు. దళిత సంఘాలతో కలిసి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌లను కలిసి ఫిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించారు. మదన్‌మోహన్ భార్యకు పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరు అని దళిత, గిరిజన సంఘాలు ప్రశ్నించాయి. విజయసాయి రెడ్డిపై ఎస్‌సి, ఎస్‌టి ఎట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేశాయి. విశాఖపట్నంలో జరిగిన భూకుంభకోణాలపై దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేశాయి. వైఎస్ఆర్ సిపి నుంచి విజయ సాయిరెడ్డి బహిష్కరించాలని డిమాండ్ చేశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News