Tuesday, September 17, 2024

తిరుమలలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో వినాయక చవితిని శనివారం ఘనంగా నిర్వహించారు. అంతకుముందు శనివారం ఉదయం సుప్రభాతంతో శ్రీ వినాయకస్వామి వారిని మేల్కొలిపి మూలవర్లకు అభిషేకం, అర్చన నిర్వహించారు.శనివారం సాయంత్రం మూషిక వాహనంపై శ్రీ వినాయక స్వామికి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఇఒ దేవేంద్రబాబు, సుపరింటెండెంట్ కృష్ణ వర్మ, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఘాట్ రోడ్లలోని ఆలయాల్లో…

రెండో ఘాట్ రోడ్డులోని శ్రీ వినాయక స్వామి ఆలయంలో వినాయక చవితి సందర్భంగా ఉదయం 8 నుంచి 9 గంటల వరకు మూలవర్లకు అభిషేకం నిర్వహించారు. అర్చన, ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. మొదటి ఘాట్ (డౌన్) రోడ్డులో ఉన్న వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News