Tuesday, September 17, 2024

వినేశ్ ఫోగట్ కు ఘన స్వాగతం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రెజ్లర్ వినేశ్ ఫోగట్‌కు శనివారం ఘన స్వాగతం లభించింది. 29 ఏళ్ల ఆమె ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్ 2024 నుండి ఫైనల్ కోసం 50 కేజీల విభాగంలో 100 గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హురాలయింది. కానీ ఆమె పోరాట పటిమ తప్పుపట్టలేనిది. ఆమె అనర్హత కేవలం విధి రాత అనే చెప్పాలి. బంగారు పతకాన్ని సాధించాల్సిన వినేశ్ ఫోగట్ అధిక బరువు కారణంగా పోటీ నుంచి అనర్హురాలయింది.

“మా  పోరాటంలో మాకు మద్దతుగా నిలిచిన దేశ ప్రజలకు నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. మా పోరాటం ఇంకా ముగియలేదు ” అన్నారు వినేశ్ ఫోగట్. పారిస్ ఒలింపిక్స్‌లో గుండెపోటు తర్వాత ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత వినేశ్ పై విధంగా చెప్పారు.  బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ , పంచాయితీ నాయకులు వినేశ్ ను రిసీవ్ చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News