Thursday, August 29, 2024

సాగర్ కుడికాలువకు నీటివిడుదల

- Advertisement -
- Advertisement -

నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడి కాలువకు ఏపిలో తాగు నీటి అవసరాల నిమిత్తం బుధవారం నాడు నీటిని విడుదల చేశారు. సాగర్ కుడి కాలువ 5,7 నంబర్ గేట్ల ద్వారా 2000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. రోజుకు 5,500 క్యూసెక్కుల చొప్పున 9 రోజుల పాటు 4.5 టీఎంసీల నీటిని కుడి కాలువ ద్వారా విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాల కోసం ఈ నీటితో చెరువులు నింపనున్నట్లు సమాచారం. ఈ నీటిని వృధా చేయరాదని అధికారులు ప్రజలకు విజ్ణప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News