Tuesday, September 17, 2024

జర్నలిస్టుల్లో అనర్హులను నియంత్రిస్తాం: మీడియా అకాడమీ ఛైర్మన్

- Advertisement -
- Advertisement -

జర్నలిస్టుల్లో అనర్హులను నియంత్రించేలా చర్యలు చేపడుతామని మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కొన్ని మీడియా సంస్థలు అక్రిడేషన్ కార్డులకు రేటుకట్టి అమ్ముకుంటున్నాయని, వాటిని అరికట్టకపోతే భవిష్యత్తులో జర్నలిజం విలువలు మరింత దిగజారుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని మనమే కట్టడి చేసుకుని నిజమైన జర్నలిస్టులను గుర్తించి వారికి అక్రిడేషన్ కార్డులు, హెల్త్‌కార్డులు, ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు సరికొత్త గైడ్‌లైన్స్ రూపొందించేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News