Tuesday, September 17, 2024

రుణమాఫీ కోసం పోరాటాలు చేస్తాం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

రుణమాఫీ కోసం ప్రత్యక్ష కార్యాచరణ చేపట్టి పోరాటాలు చేస్తామని కెటిఆర్ వెల్లడించారు. రుణమాఫీ డొల్లగా తేలిపోయిందని, రెండు రోజుల తర్వాత క్షేత్రస్థాయి నుంచి వివరాలు సేకరిస్తామని తెలిపారు. రుణమాఫీ కాని వివరాలు సేకరించి కలెక్టర్, అధికారులకు అందిస్తామని ప్రభుత్వం అప్పటికీ న్యాయం చేయకపోతే ప్రభుత్వ పెద్దలు, ముఖ్యులకు వివరాలు అందిస్తామని బిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కెటిఆర్ వెల్లడించారు. అప్పటికీ స్పందించకపోతే ప్రత్యక్ష కార్యాచరణ చేపట్టి, పోరాటాలు చేస్తామని పేర్కొన్నారు.

రైతులకు న్యాయం జరగాలన్నదే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి, మంత్రుల నియోజకవర్గాల్లో కూడా వివరాలు సేకరిస్తామన్నారు. 60 శాతం రైతులకు రుణమాఫీ కాలేదని, వారు ఆశాభావంగా ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం కూడా అందరికీ న్యాయం చేస్తుందన్న ఆశాభావంతో ఉన్నట్లు కెటిఆర్ చెప్పారు. అన్ని స్థాయిల నేతలు ఇంటింటికి తిరిగి వివరాలు సేకరిస్తామని, వారం రోజుల్లో వివరాల సేకరణ పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.

ఒక ఏడాది కడుపు కట్టుకుంటే రూ.41 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని సిఎం మొదట చెప్పారని, రుణమాఫీ రూ.49 వేల కోట్ల దగ్గర ప్రారంభం అయి రూ.17 వేల కోట్ల దగ్గర ముగించారంటూ ఎద్దేవా చేశారు. 28 లక్షల కుటుంబాలకు అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి ఇంటిని తట్టి రుణమాఫీ గురించి వివరాలు తీసుకుంటామని, దాదాపుగా మిగిలిన 28 లక్షల మంది రైతుల వివరాలు తీసుకొని వంద శాతం రుణమాఫీ అయిందని అంటున్నారని కెటిఆర్ తప్పుబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News