Monday, April 7, 2025

విండీస్ 140/6

- Advertisement -
- Advertisement -

హమీల్టన్: సిడన్ పార్క్‌లో మహిళా వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా 318 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 26 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 140 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. భారత జట్టు 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 317 పరుగులు చేసింది. ఓపెనర్లు వంద పరుగుల భాగస్వామ్యం నెలకొల్పినప్పటికి మిడిల్ ఆర్డర్ విఫలమైంది. డియాండ్రా డట్టిన్ 62 పరుగులు చేసి స్నేహ రానా బౌలింగ్‌లో మేఘనా సింగ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. మ్యాథ్యూస్ 43 పరుగులు చేసి స్నేహి రానా బౌలింగ్ లో రిచా ఘోష్ కు క్యాచ్ మైదానం వీడింది. మిడిల్ అర్డర్ బ్యాట్స్ మెన్లు సింగల్ డిజిట్ కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో మేఘనా సింగ్, స్నేహ రానా చెరో రెండు వికెట్లు పడగొట్టగా గయక్వాడ్, వస్త్రాకర్ చెరో ఒక వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News