వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా కాలమేగా కరిగింది. ఈ సినిమాను శింగర క్రియేటివ్ వర్క్ బ్యానర్పై మరే శివశంకర్ నిర్మిస్తున్నారు. శింగర మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. పొయెటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ‘కాలమేగా కరిగింది‘ సినిమా ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. శనివారం ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేశారు. కాలమేగా కరిగింది సినిమా ట్రైలర్ ఎలా ఉందో చూస్తే – ఫణి, బిందు విద్యార్థులుగా ఉన్నప్పటి నుంచి ప్రేమికులు. అమాయకత్వం నిండిన స్వచ్ఛమైన ప్రేమ వారికి ఎంతో సంతోషాన్నిస్తుంది. తమ ప్రేమే లోకంగా జీవిస్తుంటారు ఇద్దరు. కలహాలే లేని ఈ ప్రేమ కథను కాలం విడదీస్తే ఆ జ్ఞాపకాలు వెతుక్కుంటూ కథానాయకుడు ఫణి ప్రయాణం సాగిస్తాడు. ఈ నేపథ్యంలో ఈ ప్రేమికులు తిరిగి ఎలా కలిశారు అనేది ట్రైలర్లో ఆసక్తిని కలిగించింది. ఈ లవ్ స్టోరీని పొయెటిక్గా అందంగా రూపొందించారు దర్శకుడు శింగర మోహన్. గుడప్పన్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ట్రైలర్లో ఆకట్టుకుంది.
ప్రేమ కథను కాలం విడదీస్తే…
- Advertisement -
- Advertisement -
- Advertisement -