Saturday, February 22, 2025

అనుమానంతో భార్యను చంపి.. ఆపై భర్త

- Advertisement -
- Advertisement -

అనుమానంతో భార్యను హతమార్చి భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌కు చెందిన ముద్దం వెంకటేశం తన భార్య వసంత (35) ప్రవర్తనపై అనుమానంతో గురువారం ఉదయం సమీపంలోని తమ పంటపొలం వద్దకు తీసుకువెళ్లి తలపై రాడ్‌తో కొట్టి హతమార్చి తరువాత తానూ పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతురాలికి కుమార్తె , కుమారుడు ఉన్నారు. ఈ మేరకు సిరిసిల్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు సాగిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News