Tuesday, October 22, 2024

భారత్ తో రెండో టెస్టుకూ విలియమ్సన్ దూరం..

- Advertisement -
- Advertisement -

టీమిండియాతో రెండో టెస్టుకు ముందు తమ స్టార్‌ బ్యాటర్‌ కేన్‌ విలియమ్సన్‌ అందుబాటులోకి వస్తాడని ఆశించిన న్యూజిలాండ్‌ నిరాశే ఎదురైంది. భారత్‌తో పుణే వేదికగా జరిగే రెండో టెస్టుకూ విలియమ్సన్ దూరమయ్యారు. శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఆయన గాయపడిన విషయం తెలిసిందే. అయితే, కేన్ పూర్తిగా కోలుకోకపోవడంతో రెండో టెస్టుకు కూడా విశ్రాంతి ఇచ్చినట్లు కోచ్ గ్యారీ స్టెడ్ వెల్లడించారు. నవంబర్ 1న ముంబైలో జరగనున్న మూడో టెస్టుకు విలియమ్సన్ అందుబాటులోకి రావొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా, బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో భారత్ పై న్యూజిలాండ్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో మూడు టెస్టుల సిరీస్ లో న్యూజిలాండ్ జట్టు 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News