Wednesday, April 2, 2025

చత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్

- Advertisement -
- Advertisement -

దండకారణ్యం స్పెషల్ జోనల్
కమిటీ సభ్యురాలు రేణుక
మృతి మావోయిస్టు కీలక నేత
శాఖమూరి అప్పారావు సతీమణి
ఈమె తలపై రూ.25లక్షల
రివార్డు స్వస్థలం జనగామ
జిల్లా కడవెండి గ్రామం

మన తెలంగాణ/చర్ల: చత్తీస్‌గఢ్ అడవు ల్లో సోమవారం మరోసారి ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో జనగామ జిల్లా, కడవెండి గ్రామానికి చెందిన చెందిన మహిళా మావోయిస్టు నాయకురాలు రేణు క అలియాస్ చైతు అలియాస్ సరస్వతి మృ తి చెందారు. ఈమె ప్రముఖ మావోయిస్టు నేత శాఖమూరి అప్పారావు భార్య కావడం విశేషం. మృతురాలి తలపై రూ.25 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. దంతెవాడబీజాపుర్ జిల్లాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందడం తో సిఆర్‌పిఎఫ్, డిఆర్‌జి సిబ్బంది యాంటీ- నక్సలైట్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో మావోయిస్టులు కాల్పులకు తెగబడగా భద్ర తా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు.

ఎన్‌కౌంటర్ అనంతరం ఘటనా స్థలంలో ఓ మహిళా నక్సలైట్ మృతదేహాన్ని గురించినట్లు అధికారులు తెలిపారు. ఈమె మావోయిస్టు స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలిగా వ్యవహరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆమె దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రెస్ టీమ్ ఇన్ఛార్జీగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో భారీఎత్తున తుపాకులు, ఇతర ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. తాజా ఎన్‌కౌంటర్ కలిపి ఈ ఏడాది ఇప్పటివరకు చత్తీస్‌గఢ్‌లో 141 మంది మావోయిస్టులను వేర్వేరు ఎన్‌కౌంటర్లలో భద్రతా సిబ్బంది హతమార్చారు. ఇంతవరకు 346 మంది మావోయిస్టులు లొంగిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News