Sunday, February 23, 2025

లారీని ఢీకొట్టిన జీపు: ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటక రాష్ట్రం యాదగిరి జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని జీపు ఢీకొట్టడంతో ఐదుగురు మృతి చెందగా 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిని వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా వెలుగోడు చెందిన వాసులు కలబురిగిలోని దర్గా ఉరుసు జాతరకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు సమ్మి(12), ముద్దత్ సీర్(12), మునీర్(40), రమీజా బేగమ్(50), నయామత్(40)గా గుర్తించారు.

Also Read: పామును కొరికి చంపిన బాలుడు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News