Sunday, February 23, 2025

మధురానగర్‌లో యువకుడి దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

మధురానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో యువకుడిని గుర్తుతెలియని దుండగులు కత్తితో పొడిచి, తల పగులగొట్టి దారుణంగా హతమార్చారు. వివరాల్లోకి వెళితే… ఫ్రిడ్జ్ రెసిడెన్సీలో రవికుమార్ అనే సాఫ్ట్‌వేర్ ఫ్యాకల్టీని హతమార్చిన దుండగులు గదిలో కారం పొడి చల్లుకుని మరీ ఘటనా స్థలం నుంచి ఉడాయించారు. గత ఏడాదిన్నరగా ఫ్రిడ్జ్ రెసిడెన్సీలో రవికుమార్ ఉంటున్నాడు. బుధవారం నాలుగు గంటల సమయంలో రవికుమార్ భార్య బయటకు వెళ్లి తిరిగి,

ఐదు గంటలకు ఇంటికి చేరుకుంది. అదే సమయంలో రవికుమార్ హత్యకు గురయ్యాడు. రవికుమార్ హత్యపై పోలీసులకు సమాచారం అందడంతో మధురానగర్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం సైతం ఘటనాస్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించాయి. రవికుమార్ హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు పోలీసుల దర్యాప్తులో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News