Sunday, September 8, 2024

ఫ్యాకల్టీ నో చెప్పాడని యువతి ఏం చేసిందంటే..?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఫోటోలు మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న యువతిని సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఐఎఎస్ కోచింగ్ సెంటర్‌లో ఫ్యాకల్టీని ఇష్టపడిన యువతి లక్ష్మి ప్రపోజ్ చేసింది. తనకు పెళ్లైందని, ప్రేమను తిరస్కరించడంతో ఆ యువతి ద్వేషం పెంచుకుంది. ఫ్యాకల్టీ ప్రొఫెసర్, అతని భార్య, కూతురు ఫోటోలను మార్పింగ్ చేసి ఫేక్ అకౌంట్స్ సృష్టించి న్యూడ్ ఫోటోలను సోషల్ మీడియాలో ఆ యువతి పోస్ట్ చేసింది. ఫోటోలను అడ్డుపెట్టుకొని పెళ్లి చేసుకోవాలని బెదిరింపులకు దిగింది. ఇప్పటికే గ్రూప్1 పరీక్షలు రాసిన ఆ యువతి ఐఎఎస్ కోసం అశోక్‌నగర్‌లో కోచింగ్ తీసుకుంటోంది. సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనుగోలు చేసి యాచకుల పేరుతో సిమ్ కార్డు తీసుకుం దని పోలీసులు వెల్లడించారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు అనంతపురానికి చెందిన లక్ష్మీని అరెస్ట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News